మనం ఇక్కడ ఎందుకున్నామంటే........

ఓ సాయంత్రంవేళ నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద నడుస్తూ, అటుగా వస్తున్న కొందరు గుర్రపురౌతుల్ని చూసాడు ముల్లా నశీరుద్ధీన్.

వెంటనే అతడి ఆలోచనల వేగం పెరిగింది. వాళ్ళు తనను బలవంతంగా పట్టుకుని అమ్మేయవచ్చు లేక సైన్యంలో చేర్చవచ్చు అన్న ఆలోచనరాగానే పరుగందుకుని పక్కనే ఉన్న శ్మశానంలోని ఖాళీ సమాధిలో పడుకున్నాడు.

నశీరుద్ధీన్ విచిత్ర ప్రవర్తన చూసిన బాటసారులు అతణ్ణి అనుసరించారు. సమాధిలో నిలువునా బిగుసుకుపోయి, వణుకుతూ పడుకున్న ముల్లాను చూసారు.

“ఏం చేస్తున్నావ్ ఈ సమాధిలో? నువ్వు పరిగెత్తడం మేం చూసాం. మమ్మల్నేమన్నా సాయం చెయ్యమంటావా” అన్నాడు వాళ్ళలో ఒకడు.

వచ్చిన వాళ్ళు మామూలు బాటసారులే అయ్యుంటారని గమనించిన నశీరుద్ధీన్ ఇలా అన్నాడు. “మీరు ఇలా ఓ ప్రశ్న అడిగినంత మాత్రాన దానికి సూటిగా ఒక సమాధానం ఉంటుందని అనుకోవద్దు. అదంతా మీరు చూసే దృష్టికోణం మీద ఆధారపడిఉంటుంది.  అయినా  మీకో జవాబు కావాలంటే చెపుతాను. నేనిక్కడ ఉన్నది మీకారణంగా, మీరిక్కడ ఉన్నది నాకారణంగా” అన్నాడు.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంచాయతీ మెట్లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"