పోస్ట్‌లు

2015లోని పోస్ట్‌లను చూపుతోంది

ఇక్కడ కాంతి ఎక్కువ ఉంది….

  ఒకతను నేల మీద ఏదో వెతుక్కుంటున్న నశీరుద్ధీనును చూసాడు. “ ఏం పోగొట్టుకున్నావ్ నశీరుద్ధీన్ ” అని అడిగాడు. “ నా తాళం చెవుల్ని ” చెప్పాడు నశీరుద్ధీన్. వాళ్ళిద్దరూ మొకాళ్ళమీద కూర్చుని మరీ వెతకసాగారు. కొంతసేపటికి పక్కవాడు అడిగాడు. “ నువ్వు దాన్ని సరిగ్గా ఎక్కడ పోగొట్టుకున్నాయో చెప్పగలవా ”? “ నా ఇంట్లో ” . “ మరి ఇక్కడకొచ్చి ఎందుకు వెతుకుతున్నావు ”? “ ఎందుకంటే నా ఇంటి బయట కాంతి ఎక్కువ ఉంది అందుకనీ ”!

పిల్లి – మాంసం

ఒకరోజు నశీరుద్ధీన్ తన భార్యకు మాంసం తెచ్చి ఇచ్చి అతిధులకు వండి పెట్టమన్నాడు. భోజనం తయారైంది కానీ అందులో మాంసం కూర లేదు. భార్య ముందే తినేసింది. “ ఆ పాడు పిల్లి తినేసింది. మొత్తం కేజీమాంసాన్ని ” అంది. నశీరుద్ధీన్ ఆ పిల్లిని పట్టుకుని తూకం వేసాడు. దాని బరువు కేజీ ఉంది.   “ పిల్లి ఇదే అయితే, మాంసం ఎక్కడునట్టు ! ఒకవేళ మాంసం ఇదే అయితే పిల్లి ఏమయినట్టు ?” అన్నాడు నశీరుద్ధీన్.

రహస్య వ్యాపారి

నశీరుద్ధీన్ తరుచుగా పర్సియా నుండీ గ్రీస్ కు గాడిద మీద వెళ్ళేవాడు. గాడిదకు అటూ ఇటూ గడ్డితో నింపిన తోలు సంచులను కట్టి తీసుకువెళ్ళేవాడు. వెళ్ళిన ప్రతిసారీ సరిహద్దు వద్ద తనిఖీ అధికారులు అతడ్ని ఆపి నిష్షిద్ధ వస్తువులు ఏమైనా తీసుకువస్తున్నాడేమోనని పరీక్షించేవారు. కానీ ఎప్పుడూ గడ్డి తప్ప ఏమీ కనిపించేది కాదు. ఓరోజు అధికారి అడిగాడు “ఏం తీసుకు వెళుతున్నావ్ నశీరుద్ధీన్?” “నేనో రహస్య వ్యాపారిని” అని నవ్వుతూ బదులిచ్చాడు. కొన్ని సంవత్సరాలు తర్వాత నశీరుద్ధీన్ బాగా డబ్బు గడించి ఈజిప్టులో స్థిరపడ్డాడు. ఒకరోజు అతడికి పాత తనిఖీ అధికారి తారసపడ్డాడు. “ఇప్పుడు చెప్పు నశీరుద్ధీన్! చాలా దర్జాగా బ్రతుకుతున్నావు, మనం ఆ పర్సియా గ్రీసు దేశాల పరిధిలో కూడా లేము. అసలు ఎప్పుడూ మాకు పట్టుబడకుండా నువ్వు రహస్యంగా రవాణా చేసే ఆ సరుకు ఏమిటి?” అని అడిగాడు అధికారి. “గాడిదలు” సమాధానం చెప్పాడు నశీరుద్ధీన్.

కుండ కనగలిగినపుడు...

ఒకరోజు నశీరుద్ధీన్ తన వంట పాత్రలను పొరుగు వాడికి విందు సందర్భంగా అరువు ఇచ్చాడు. పని కాగానే పొరుగువాడు ఆ కుండలతో పాటు ఒక చిన్న కుండను కూడా తిరిగి ఇచ్చాడు. “ఏమిటిది?” అడిగాడు నశీరుద్ధీన్. “న్యాయప్రకారం నీ కుండలకు పుట్టిన సంతానం నీదే కనుక నీకు అప్పగించాను” అన్నాడు పొరుగువాడు. కొన్ని రోజులకు నశీరుద్ధీన్ అదే పొరుగువాడి దగ్గర కుండలు అరువుతీసుకున్నాడు. కానీ తిరిగి ఇవ్వలేదు. పొరుగింటి వాడు కుండలిమ్మని అడిగితే “అయ్యో! అవి చచ్చిపోయాయి. నువ్వే కదా కుండలకి పుట్టుక ఉంది అని తేల్చావు, అప్పుడు వాటికి చావు కూడా మామూలే కదా,” అని జవాబిచ్చాడు.

మనం ఇక్కడ ఎందుకున్నామంటే........

ఓ సాయంత్రంవేళ నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద నడుస్తూ, అటుగా వస్తున్న కొందరు గుర్రపురౌతుల్ని చూసాడు ముల్లా నశీరుద్ధీన్. వెంటనే అతడి ఆలోచనల వేగం పెరిగింది. వాళ్ళు తనను బలవంతంగా పట్టుకుని అమ్మేయవచ్చు లేక సైన్యంలో చేర్చవచ్చు అన్న ఆలోచనరాగానే పరుగందుకుని పక్కనే ఉన్న శ్మశానంలోని ఖాళీ సమాధిలో పడుకున్నాడు. నశీరుద్ధీన్ విచిత్ర ప్రవర్తన చూసిన బాటసారులు అతణ్ణి అనుసరించారు. సమాధిలో నిలువునా బిగుసుకుపోయి, వణుకుతూ పడుకున్న ముల్లాను చూసారు. “ఏం చేస్తున్నావ్ ఈ సమాధిలో? నువ్వు పరిగెత్తడం మేం చూసాం. మమ్మల్నేమన్నా సాయం చెయ్యమంటావా” అన్నాడు వాళ్ళలో ఒకడు. వచ్చిన వాళ్ళు మామూలు బాటసారులే అయ్యుంటారని గమనించిన నశీరుద్ధీన్ ఇలా అన్నాడు. “మీరు ఇలా ఓ ప్రశ్న అడిగినంత మాత్రాన దానికి సూటిగా ఒక సమాధానం ఉంటుందని అనుకోవద్దు. అదంతా మీరు చూసే దృష్టికోణం మీద ఆధారపడిఉంటుంది.  అయినా  మీకో జవాబు కావాలంటే చెపుతాను. నేనిక్కడ ఉన్నది మీకారణంగా, మీరిక్కడ ఉన్నది నాకారణంగా” అన్నాడు.

మరోదారి

చిన్నప్పుడు అమ్మమ్మ, నాయనమ్మలు చెప్పిన పేదరాసి పెద్దమ్మ కథలు, తెనాలి రామకృష్ణుని కథలు, అక్బర్ బీర్బల్ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు ఎంత అల్లి చెప్పినా వాటిని అల్లి చెపుతున్నారని మనకు తెలిసినా వినసొంపుగానే కాదు, సరదానూ తెలియని ఆసక్తినీ రేపేవి. అంతే కానీ నిజంగా తెనాలి రామకృష్ణడు అంత తెలివిగలవాడా అనే అనుమానమూ రాలేదు, అక్బర్ ముందు బీర్బల్ చూపిన చతురత నిజమేనా అనే సందేహమూ మనకు కలగలేదు. పెదరాసి పెద్దమ్మ పై అల్లిన కథలను ఈనాటికీ వింటునే ఉన్నాం. మనలానే ఇతరదేశాల వారూ ఓ తెనాలి రామకృష్ణుడు, బీర్బలు లాంటి పాత్రను వారూ సృష్టించుకున్నారు. అతడే  ముల్లా నసీరుద్ధీన్. చతురత, కాస్త అమాయకత్వం కలబోసిన ఈ కథల్ని మన తెలుగులో చెప్పాలని చిన్న కోరిక పుట్టింది............. ఒకరోజు తన స్నేహితులతో టీ దుకాణంలో ఉన్న నసీరుద్ధీన్ “అతిధ్యమివ్వడంలో నాకు సాటి ఎవరూలేరు” అంటూ ఢాంబికాలు పోయాడు. ఇంతలో అతని పక్కనే ఆశపోతు స్నేహితుడొకడు “చాలా మంచిది అయితే రాత్రి భోజనానికి మమ్మలందర్నీ మీ ఇంటికి తీసుకువెళ్ళవచ్చుగా,” అన్నాడు. నశీరుద్ధీన్ తన స్నేహితులందరినీ గుంపుగా కూడదీసి ఇంటికి బయలుదేరాడు. ఇంటి దరిదాపులకు వచ్చాకా, “నేను ముందుగా...

అనుభవాలు - జ్ఞాపకాలు చదివిన తర్వాత

చిత్రం
  చాలా రోజులుగా నాతో దగ్గరగా తన రహస్యాలు చెప్పుకున్న నేస్తం నిన్నటినుండీ నాతో మాట్లాడటంలేదు. ఉన్నట్టుండి ఏమైపోయాడో తెలీదు. తన గురించి సగమే చెప్పాడేమో, ఇంకా నేను తెలుసుకోవలసింది అసంపూర్ణంగా మిగిలిపోయిందని ఆఖరు పేజీ చదివాకనే తెలిసి , బాధ ఎక్కువైంది. ఆయన జీవి తం పువ్వుల బాటేం కాదు. జీవితంలో ఒకే లక్ష్యాన్ని పెట్టుకుని దానికోసమే బ్రతికి, ఎన్నో అవమానా లూ అనా ద రణకు గురైన సందర్భాలు, కలలో కూడా మరపుకురానంతగా దీక్ష బూ ని మరీ సాధించిన జ్ఞానం , ఏనుగంత ఎత్తు రచనలు చేయాలన్న తపన, దానిలోనే తనువు చాలించడం మహానుభావులకే సాధ్యం. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ‘ అనుభవాలు -జ్ఞాపకా లూను’ చదువుతున్నప్పుడు నాకు మొదట ఎంత త్వరగా ఈ పుస్తకం పూర్తి చేసి కొత్త ది మొదలు పెడతానా అనిపించింది. కానీ వంద పేజీ లు దాటాకా వారాల భోజనం, చదువుకోసం దూరాలు పోయి కొంతకాలం అక్కడే ఉండిపోవడం, తెలియని విద్యలతో పాటు మంచి నడవడికను, మర్యా దా మన్న న లను తెలుసుకోవడంతోపాటు, విద్యకోసం ఆరోజుల్లో ఇంటిని, కన్నవారినీ విడిచి అంతంత దూరాలు వెళ్ళి చదువుకోవడం చూసాకా ఆనాటి పరిస్థితులగురించి రచయిత చెప్పాలనుకుంటుంది శ్రద్ధగ...