పోస్ట్‌లు

2013లోని పోస్ట్‌లను చూపుతోంది

బంధనాల స్వభావాన్ని చిత్రించే “స్వేచ్ఛ”

చిత్రం
ఓల్గా గారి నవల "స్వేచ్ఛ" రివ్యూ కినిగె పత్రిక డిసెంబరు సంచికలో పడింది. దాని లింక్:  http://patrika.kinige.com/?p=355&view-all=1 పిడిఎఫ్ లింక్:  http://patrika.kinige.com/wp-content/uploads/2013/12/Review-of-Swetcha.pdf ఈ పుస్తకానికి రాసిన పరిచయంలో రచయిత  ఓల్గా  స్వేచ్ఛ గురించి ఇలా అంటారు: ఈ  స్వేచ్ఛ  ఎవరో ఒకరు ఇచ్చేది కాదు. ఎవరి దగ్గర నుండి సాధించుకునేది కాదు. మన అవసరాలను, మన ఉనికికి అత్యవసరమైన విషయాలను మనం గుర్తించడమే స్వేచ్ఛ. నిజానికి ఇది సాధించడమే చాలా కష్టం. మన నుండి మనకు స్వేచ్ఛ. మనకు పుట్టుక నుండీ అలవాటైన భావాల నుండీ అభిప్రాయాల నుండీ ఆచారాల నుండీ స్వేచ్ఛ. మనలో జీర్ణించుకు పోయిన నమ్మకాల నుండీ విడుదల. అరుణ ఎమ్మే ఆఖరి సంవత్సరం పరిక్షలు రాసింది. మధ్యతరగతి కుటుబంలో పుట్టి పెరిగిన ఆమె చిన్న నాటి నుండి అదుపాజ్ఞలతో పెరిగింది. వయసు రాగానే తండ్రీ, అన్నగారూ అరుణకు హద్దులు నిర్ణయించేవారు. దీనికి కొంత కారణం అరుణ మేనత్త కనకమ్మ, భర్త చిన్నవయసులోనే చనిపోవడంతో తమ్ముడి (అరుణ తండ్రి) ఇంటికి కొంత ఆస్తితో చేరింది. వయసులో జరగాల్సిన ముచ్చ...

విలువల్ని నిలదీసే శారద నవలలు

చిత్రం
శారద గారి అసలు పేరు ఎస్. నటరాజన్ గారు. ఈయన తమిళదేశస్తుడు. పన్నెండేళ్ళప్పుడు తెనాలి వచ్చారు. చిన్ననాటి నుండి తమిళ సాహిత్యంపై మక్కువతో ఆ వయసులోనే పలు రచనలు చదవారు. తనకున్న పఠనాశక్తి వల్ల తెనాలి రాగానే తెలుగు భాష కూడా నేర్చుకొని ఎన్నో రచనలు చదవడమే కాక తోటివారికి చెపుతుండేవారు. నటరాజన్ గారు తెలుగు భాషలో పలు కథా, నవలా రచనలను చేసారు. వారి మొదటి రచన “ప్రపంచానికి జబ్బు చేసింది”. ఆయన రచనల్లో నేను ప్రస్తుతం చదివింది పర్‌స్పెక్టివ్స్ వాళ్లు ప్రచురించిన “శారద నవలలు”. ఇందులో మెుత్తం మూడు నవలలు ఉన్నాయి. అవి: “ఏది సత్యం”, “మంచీ చెడు”, “అపస్వరాలు”. ఏది సత్యం పార్వతి భర్త సాంబశివరావు. రైసు మిల్లులో సూపర్ వైజర్ గా పనికి కుదిరాడు. వారి సంసారం చక్కగా సాగుతున్న తరుణంలో, సాంబశివరావుకు రైసు మిల్లులో ఒక ప్రమాదం జరిగి కాలు విరిగిపోతుంది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా, సుఖంగా సాగుతున్న వారి సంసారంలో కష్టాలు ప్రవేశించాయి. ఇల్లు గడవడం భారంగా మారింది. సంసార భాధ్యత అమాయకురాలైన పార్వతి పై పడింది. పొరుగింటి వారి సహాయంతో చిన్న ఉద్యోగంలో చేరింది పార్వతి. పార్వతి ఉద్యోగం చేయడం సాంబశివరావుకు ఇష్టం ఉందదు గానీ, పొరుగ...

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

చిత్రం
హిమజ్వాల నవల వడ్డెర చండీదాస్ రచించారు. కథ ప్రారంభంలో గజి బిజిగా అనిపించింది. నెమ్మదిగా పాత్రల స్వభావాలను అర్థం చేసుకుంటూ కథలోని ఉద్దేశాన్ని తెలుసుకోడానికి పూర్తిగా చదివాను. ఈ కథ మనిషి మనసు ఎన్ని రకాలుగా మారుతుందో ఎలాంటి నిర్ణయాలను తీసుకునేలా చేస్తుందో తెలుపుతుంది. కృష్ణచైతన్య, గీతాదేవి అనే పాత్రల చుట్టూ నడుస్తుంది కథ. కథావిషయం:— ఉన్నతమైన కుటుంబానికి చెందిన కృష్ణచైతన్య కాలేజీ లెక్చరర్. ఒకనాడు రోడ్డు మీద అతనికి అపస్మారక స్థితిలో తారసపడుతుంది గీతాదేవి. ఆమెది మధ్యతరగతికి కుటుంబ నేపథ్యమైనా ఉన్నత చదువులు చదివింది. ఒంటరిగా ఉన్న అతనికి మొదటిసారిగా ఆమెపై కలిగిన  అనురాగం ఆరాధనలను ప్రేమ పూర్వకంగా కాక కోరికగా తెలుపుతాడు. అతని నుండి ఆమె దూరంగా వెళిపోతుంది. బొంబాయిలో ఉన్న స్నేహితురాలి దగ్గరకు చేరుతుంది. అక్కడ స్నేహితురాలి భర్త ఆమెను వేధించటంతో, చివరకు కృష్ణచైతన్య స్నేహితుడైన శశాంక్ సహాయంతో ఒక పత్రికలో చేరుతుంది. కొన్నాళ్ళకు లెక్చరర్ గా స్థిర పడుతుంది. అక్కడే శివరాం తో పరిచయం అవుతుంది. ఆ పరిచయం కొన్నాళ్ళకు ప్రేమగా మారి పెళ్ళికి దారితీస్తుంది. అతనితో కొత్తజీవితం కొన్నాళ్ళు సరదాగా సాగు...

మునెమ్మ ప్రతీకారం...

చిత్రం
మునెమ్మ నవల 2008లో ప్రచురితమైంది. రచయిత డాక్టర్ కేశవరెడ్డి. కథా విషయం:–  మునెమ్మ పల్లెటూరి పడుచు. జయరాముడు ఆమె భర్త. అతను మొరటుదనం, కరుకుదనం కలిగిన మనిషి. తనకు తోచింది తప్ప ఎవరి మాటా వినే రకం కాదు.  మునెమ్మ అత్తవారింట కాపురానికి వచ్చిన రోజే పుట్టిన బొల్లిగిత్త అంటే ఆమెకూ, కుటుంబ సభ్యులకే కాదు, ఆ ఊరి వారందరికీ ఇష్టమే. వీధిలో పోతూ ఉంటే జయరాముణ్ణీ, బొల్లిగిత్తనూ రామలక్ష్మణులనేవారు. బొల్లిగిత్తను తమ బిడ్డగా భావించి మునెమ్మ జయరాములిద్దరూ తమ చేతి మీద దాని బొమ్మ పచ్చ పొడిపించుకుంటారు. ఆ బొల్లిగిత్త వారి జీవనాధారం కూడా.  ఒకరోజు బొల్లిగిత్త మునెమ్మ మీదకు రెండు కాళ్లతో లేచి లైంగిక చేష్ట లాంటిది ప్రదర్శించటం చూసిన జయరాముడు రెచ్చిపోయి పారతో దాడి చేస్తాడు. చావబాదినా బొల్లిగిత్తపై కోపం తగ్గక దాన్ని సంత (పరస)లో అమ్మేసి కొత్త గిత్తను కొంటానని అక్కణ్ణించి ఆవేశంగా వెళిపోతాడు. ఈ సన్నివేశంతోనే కథ మొదలవుతుంది. ఈ కథ అంతట్నీ మనకు చెప్పేది జయరాముడి దూరపు చుట్టమైన సినబ్బ.  జయరాముని తల్లి సాయమ్మ బొల్లిగిత్తను జయరాముడు చావబాదాడని మునెమ్మ ద్వారా తెలుసుకుంటుంది. ...

ఆశ నిరాశల దోబూచులాట “ఊరి చివర ఇల్లు”

చిత్రం
అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోయే వేళ దోసిళ్ల కొద్దీ అమృతాన్ని తాగిన కవిగానే తిలక్ నాకు తెలుసు. ఈ కథతో ఆయన నాకు కథకునిగా మొదటిసారి పరిచయం అయ్యాడు. కథా విషయం:– ఊరికి దూరంగా పచ్చని పొలాల నడుమ, చింత చెట్లు తుమ్మ చెట్ల మధ్య, చూరు వంగి, గోడలు బెల్లులు ఊడి ఉందా ఇల్లు. మనుష్య సంచారం ఆ ఇంట ఉందా అనే సందేహం కలగక మానదు కొత్త వారికి. ఆ ఇంటిలో ఒక యువతి, ఆమెతో పాటు ఒక అవ్వ ఉన్నారు. వాతావరణం దట్టమైన మబ్బులతో కప్పి ఉండి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ఇరవై మూడేళ్ళ ఆ యువతి ఇంటి వరండా లోంచి అలా కురుస్తున్న వర్షాన్ని చూస్తూంది. తనలో రేగుతోన్న ఆలోచనలకు, దిగులుకు, దుఃఖానికి రూపాన్ని వెతుకుతున్నట్లు ఉన్నాయామె శూన్యపు చూపులు. రోడ్డంతా గతుకులతో బురదతో నిండి ఉంది. వర్షపు నీరు ఆ ఇంటిముందు కాలువలుగా ప్రవహిస్తుంది. చలిగాలి కూడా తోడయింది ఆ వాతావరణానికి. అంతలో వర్షంలో తడుస్తూ, బురదలో కాళ్లీడ్చుకుంటూ ఆ ఇంటి మందుకు వచ్చాడో యువకుడు. తాను తన మిత్రుణ్ణి కలవడానికి గాను ఈ ఊరు రావలసి వచ్చిందని, తిరిగి రైల్వే స్టేషన్‌ వెళ్లాల్సిన తనకు వర్షం అడ్డంకిగా మారిందని అంటాడు. ఈ రాత్రి ఇక్కడే ఉండి వాన తెరిపిచ్చాకా ...

ఉత్కంఠ భరితం "చంద్రగిరి శిఖరం"

చిత్రం
బిభూతి భూషణ్ గారు బెంగాలీలో ప్రముఖ రచయిత. పదహారుకు పైగా నవలలూ, రెండొందల పైచిలుకు కథలూ రాశాడు. వాటిలో బాగా ప్రసిద్ధి పొందినవి “పథేర్ పాంచాలి”, “అపరాజితుడు”, “వనవాసి” అనే మూడు నవలలు. ఇవన్నీ ఇదివరకే తెలుగులో వచ్చాయి. ఇపుడు వీటిలా ఆత్మకథాత్మకంగా కాక, కాల్పనిక శైలిలో రచించిన “చంద్రగిరి శిఖరం” (చందే పహార్) కూడా కాత్యాయని గారి అనువాదంతో తెలుగులో వచ్చింది. స్వతహాగా ప్రకృతి ఆరాధకుడైన బిభూతి భూషణ్ ఈ నవలలో ప్రకృతి సౌందర్యాన్ని, అందులోని విలయాలను, వింతలను, విశేషాలను కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తారు. కథా విషయం:- శంకర్ ఓ పల్లెటూరి కుర్రవాడు. చదువు పూర్తి చేసుకొని గ్రామానికి వస్తాడు. కుటుంబ పరిస్థితుల వల్ల కెన్యాలోని మెుంబాసా దగ్గర రైల్వేశాఖలో గుమస్తాగా పనిలో చేరతాడు. అత్యంత ప్రమాద భరితమైన ఆ ప్రాంతం మానవుని రక్తాన్ని మరిగిన సింహాలకు నిలయమని తెలుసుకుని అక్కడికి ముఫ్పై మైళ్ల దూరంలోని కిసుమూ రైల్వే స్టేషన్‌కి స్టేషన్ మాస్టరుగా కొత్త ఉద్యోగంలో చేరతాడు. అక్కడ జనసంచారం తక్కువ. ఒక రోజు ఆ అటవీ ప్రాతంలో ఒక పోర్చుగీసు యాత్రికుడు డిగో అల్వరేజ్ అపస్మారక స్థితిలో కనిపిస్తాడు. శంకర్ అతణ్ని బతికిస్తాడు. అతను వ...

మనం కోల్పోయిన ప్రపంచాన్ని గుర్తు చేసే "బంగారు మురుగు"

చిత్రం
శ్రీరమణ గారు రాసిన "బంగారు మురుగు" కథ చదివాకా, నా బాల్యం గుర్తుకు వచ్చింది. బామ్మ అందరికీ బాల్యపు తీపి గుర్తు. ఈ కథ చదువుతుంటే, మా బామ్మ కూడా ఇలానే ఉండేది అనో, ఇలాంటి బామ్మ నాకూ ఉంటే ఎంత బాగుండేది అనో అనుకోని వారు ఉండరు. ఇది అరవై ఏళ్ల బామ్మకూ, ఆరేళ్ల మనవడికీ మధ్య సాగే కథగా మాత్రమే గాక, మన మధ్య జరుగుతున్నదా అన్నట్టూ, ఆ కథలో మనమూ పాత్రలై ఉన్నామా అనిపించేట్టూ సాగుతుంది. గట్టి పిండంగా పేరు తెచ్చుకున్న బామ్మకు మనవడన్నా, తన చేతికున్న బంగారు మురుగు అన్నా, తాను పుట్టింటి నుంచి కాపురానికి వస్తూ తెచ్చుకున్న పెరటిలోని బాదం చెట్టన్నా ప్రాణసమానాలు. ఈ బాదం చెట్టే బామ్మా మనవళ్ల స్థావరం. ఇద్దరికీ రోజులో మూడు వంతులు అక్కడే కాలక్షేపం. బామ్మ తత్త్వం ఎవరికీ బోధపడదు. ఎదుటివారిని మాట్లాడనీయక, తన దైన వాగ్ధాటితో, ప్రేమావాత్సల్యంతో అబద్ధం చెప్పాలనుకున్న వారితో కూడా నిజం చెప్పించగలదు. కొడుకూ కోడలూ ఆస్తిని స్వామీజీలకు కైంకర్యం చేస్తూంటారు. బామ్మ మాత్రం వచ్చే పోయే స్వామిజీలను ఆటపట్టిస్తూంటుంది. ఒక స్వామీజీ దృష్టి బామ్మ బంగారు మురుగు మీద పడుతుంది. దాన్ని ఎలాగైనా తనకు దక్షిణగా దక్కించుకోవాలని ప్రయ...

అల్లం శేషగి రావు కథ "చీకటి"

చిత్రం
“చీకటి”... ఇది ఇంత అందంగా ఉంటుందని నాకు తెలీదు. నా మనసుకు హత్తుకున్న ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది ఈ కథ. నేను ఈ మధ్య చదివిన కథల్లో వర్ణనలతో కూడినది, మేధస్సుకు పదును పెట్టే శైలితో నన్ను ఆకట్టుకున్నదీ ఈ కథ. ఇది ఇద్దరి వ్యక్తులకు మధ్య జరిగే సంభాషణ. వారిలో ఒకరి జీవితంలో జరిగిన సంఘటనల సమాహరం. ప్రతీ మనిషికీ ఒక కథ ఉంటుంది. అది చెప్పుకునే సందర్భాలు చాలా తక్కువగా వస్తాయి. అది ఎవరికి చెప్పాలో కూడా మనం నిర్ణయించుకోం. కానీ కాలగమనంలో మనకు తారసపడే వ్యక్తులలో మనసుకు నచ్చిన వారితో సందర్భానుసారంగా మన జీవితాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ఎవరు గొప్పా, ఎవరు తక్కువ అన్నది చూపకుండా ఇద్దరినీ స్నేహితులుగా చూపుతూ, చదువుతోనే రాని, లేని జ్ఞానాన్ని చూపుతూ కథ నడిపిన తీరు నాకు నచ్చింది. ప్రకృతిని ఇష్టపడే వ్యక్తులు చాలామందే ఉంటారు, కానీ చీకటిని ఇష్టపడేవారు చాలా తక్కువ.  మన లోకం వెలుగు ఉన్నంత వరకే. కానీ దీపం వెలుతురు లేని చీకట్లోనూ అందం ఉందని ఈ కథ చెప్తుంది. పాఠకుడు ఈ కథ చదువుతున్నపుడు తన మదిలో ప్రతీ దృశ్యాన్నీ ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ప్రతీ దృశ్యం మన ముందే జరుగుతుందనే మాయాజాలం చేయటం రచయిత గొప్పదనం....

జీవం

చిత్రం
నా సుగంధ పరిమళాలు  దిగంతాలు వ్యాపించడం తెలుసు ఏటి ఒడ్డున నిలుచున్న నాకు నీటి గలగలలు తెలుసు నా నీడన శయనించిన ప్రేమ జంటల కిలకిలలు తెలుసు ప్రతి వెన్నెల రాత్రి నెలరాజు పలకరింపుగా నవ్వింది తెలుసు పక్షులు నాపై వాలి పాడిన విరహగీతాలు తెలుసు చిట్టి చేపలు నీట తేలి నా నీడతో సయ్యాటలాడటం తెలుసు కానీ ఇప్పుడన్నీ  చాలా దూరంగా  పారిపోయాయి  ఎందుకనో మరి నాలో  పూర్వపు జీవం లేదనో ఆకులు రాలి పువ్వులు వడలి మోడుగా మిగిలాననో

శ్రీకారం

లోపల అలలుగా వచ్చే ఆలోచనల్ని ఇక్కడ వెలిబుచ్చుకోవాలనుకుంటున్నాను. ఇది నా మొదటి బ్లాగు. ఏదో డైరీ రాతలు తప్ప పెద్దగా రాసిన అనుభవం కూడా లేదు. ఈ బ్లాగు అలవాటైనా నాకు రాయడం నేర్పుతుందని ఆశ. తప్పులుంటే క్షమించి ప్రోత్సహించండి. మంచి సూచనలు చేస్తారని ఆశిస్తున్నాను.